ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డు లోని చిన్నారుట్ల వద్ద కర్నాటక కు చెందిన టూరిస్ట్ ల బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న కొండ ను ఢీ కొట్టింది.. దీంతో బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా..బస్సు లోని పది మంది యాత్రికులు గాయపడ్డారు.బస్సు కొండ ను వేగంగా ఢీ కొట్టడంతో ముందు భాగం నుజ్జు నుజ్జు కగా.. ముందు టైర్లు బస్సు నుండి విడిపోయాయి. కర్నాటక నుండి ప్రముఖ ఆలయాల దర్శనార్ధం కోసం బయలు దేరిన ఈ యాత్రికులు, శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనం కోసం వెళుతుండగా వారి బస్సు ప్రమాదానికి గురైనది.గాయపడిన వారిని 108 వాహనాల ద్వారా సుండిపెంట లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సు లో 45 మంది యాత్రికులు ఉన్నారు..పెను ప్రమాదం జరిగిన ప్రాణా ప్రాయం తప్పడం తో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు.
Admin
ANDHRA TIMES NEWS