ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల ప్రయాణికులతో కిటకిటలాడుతున్న దోర్నాల బస్టాండ్ రేపు కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం వెళ్తుండడంతో దోర్నాల బస్టాండ్ లోఆదివారం శ్రీశైలం వెళ్లే యాత్రికులు సాయంత్రం పెద్ద ఎత్తున చేరుకున్నారు. బస్సులు నిండుగా రావడం, బస్టాండ్లోకి కూడా రాకుండా వెళ్లిపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆటో, జీపు, బొలెరో వంటి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నల్లమల ఘాట్లో ఆటోల్లో, జీపుల్లో వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు.
Admin
ANDHRA TIMES NEWS