ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల శ్రీశైలం దైవ దర్శనం కోసం వెళుతున్న వినుకొండకు చెందిన ప్రయాణికులు ఆదివారం దోర్నాలలో ఆర్టీసీ బస్సులో తమ బ్యాగ్ను మరిచిపోయారు. వెంటనే దోర్నాల పోలీసులను సంప్రదించగా.. వారు వాహనాలు తనిఖీ నిర్వహించి బ్యాగ్ను గుర్తించారు. అనంతరం దోర్నాల ఎస్సై మహేశ్ బాధితులకు పోలీస్ స్టేషన్ నందు బ్యాగ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మహేశ్, సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
ANDHRA TIMES NEWS