ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : *ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో జాతీయ రహదారి పై ట్రాక్టర్లు అడ్డు గా పెట్టి ధర్నా*చేశారు గ్రామస్తులు. రోడ్డు ప్రమాదంలో బొమ్మలపురం గ్రామస్థుడు శ్రీనివాస్ మృతి చెందాడని ఆగ్రహంతో జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నా చేశారు.ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో గ్రామస్తులు సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ అంతాయం ఏర్పడింది. కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద సూచికలు సర్వీస్ రోడ్డు డ్రైనేజీ సేఫ్టీ గ్రిల్ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దదోర్నాల ఎస్ఐ వి.మహేష్ పోలీస్ సిబ్బంది చిన్న గుడిపాడు గ్రామస్తులతో చర్చించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలకు దిగితే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. చిన్న గుడిపాడు గ్రామం ప్రజలు మరియు మా యొక్క విన్నపము స్వీకరించి మాకు సౌకర్యాలు కలిగించాలని తెలియజేశారు.
Admin
ANDHRA TIMES NEWS