ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : దోర్నాల మండలం ఐనముక్కలలోని SC పాలెంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న NTR భరోసా పింఛన్ పంపిణి కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే ఐనముక్కల గ్రామంలో యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు స్వయంగా పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎరిక్షన్ బాబు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో పెంచిన NTR భరోసా పింఛన్లను సచివాలయ ఉద్యోగుల ద్వారా ఉదయం 7 గంటల నుండే పంపిణి చేశామన్నారు. వృద్దాప్య, వితంతు పింఛన్ దారులకు ₹4వేలు, వికలాంగులకు ₹6వేలు అందించారు...!! కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
ANDHRA TIMES NEWS