ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : తర్లుపాడు మండల స్థాయిలో ఉత్తమ అవార్డు గ్రహీతలకు అభినందన సభలో భాగంగా తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముత్తోజు సుధాకర్ మాట్లాడుతూ అన్ని వృత్తుల్లో కెల్లా పరమ పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. గొప్ప దానం విద్యా దానం. దేశ అభివృద్ధిలో పాలుపంచుకునే భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉంది. ఉపాధ్యాయులు అంటే తరాల తయారీదారులు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది. తనకంటే ఎదిగిన వారిని చూస్తే అసూయ కలగడం మానవ నైజం కానీ ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం తన శిష్యులు ఎంత ఎదిగితే ఆ ఉపాధ్యాయుడు అంత సంతోషపడతాడని, అటువంటి ఉపాధ్యాయులను సత్కరించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా డిప్యూటీ డిఈఓ శ్రీనివాసరావు, మార్కాపురం యంఈఓ సుబ్రహ్మణ్యం పాల్గొనగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు అయిన కె బ్రహ్మనందం తర్లుపాడు జడ్పిహెచ్ఎస్, పఠాన్ రెహ్మాన్ ఖాన్ జడ్పిహెచ్ఎస్ తుమ్మలచెరువు, చేగిరెడ్డి రామిరెడ్డి లూథరన్ ఉన్నత పాఠశాల తర్లుపాడు, పెరుమాళ్ళ కోటిమోహన్ జడ్పిహెచ్ఎస్ చెన్నారెడ్డి పల్లి, వి లక్ష్మీ కుమారి జడ్పిహెచ్ఎస్ కేజీ పాడు, జి రవికుమార్ జడ్పిహెచ్ఎస్ తాడివారి పల్లి, కె నరసింహులు జడ్పిహెచ్ఎస్ నాగేళ్ళముడుపు, పి సంధిప్తి కెజిబివి కలుజువ్వలపాడు, కె మురళి మోహన్ జడ్పిహెచ్ఎస్ మీర్జెపేట, జి రాజగోపాల్ జడ్పిహెచ్ఎస్ పోతలపాడు లను మండల ఉత్తమ అవార్డు గ్రహితలు గా ఎన్నుకొని అవార్డు, మెమెంటో , శాలువాలతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు , మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.
Admin
ANDHRA TIMES NEWS