ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : కంభం మండలం లో ఉన్న అర్బన్ కాలనీ 1985 సం॥లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు యన్.టి.రామారావు ప్రభుత్వములో ఏర్పాటు చేశారు.అర్బన్ కాలనీలో సుమారు 2000 కుటుంబాలునివసిస్తున్నారు. 'మంథా' తుఫాన్ కారణంగా అర్బన్కాలనీలో డ్రైనేజి కాలువలు లేక వర్షపునీరు ఇళ్ళలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ గిద్దలూరు నియోజకవర్గ ఎన్ ఆర్ ఐ సభ్యులు టీడీపీ నాయకులు సయ్యద్ రఫీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్దికీ వినతిపత్రం అందజేశారు.అంతేకాకుండా ఇళ్ళలో ఉన్నటువంటి గృహోపకరణాలు మరియు నిత్యవసరాలు అన్ని తడిచిపోయాయాన్ని ఇప్పుడే కాకుండా తుఫాన్ వచ్చిన ప్రతిసారి ఇళ్ళలోకి నీరు చేరి చాలా ఇబ్బందులు పడుతున్నారని అర్బన్కాలనీలో అంతర్గతదారులు వర్షపుదాడికి బురదమయంగా మారి నడుచుటకు వీలులేకుండా ఉంటున్నదన్నారు. రైల్వే స్టేషన్ నుండి కాలనీ మెయిన్ రోడ్డు గుంతలు పడి నడుచుటకు, బైక్ లు బండ్లు, ఆటో రిక్షాలు కూడా వెళ్ళుటకు ఇబ్బందికరంగా ఉంటుందనీ, అనేక మంది క్రింద పడి ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు. అర్బన్కాలనీలో అంతర్గత సిమెంట్రోడ్డులు మరియు డ్రైనేజి కాలువలు మంజూరు చేయాలనీ కోరగా సమస్యను పరిష్కరిస్తామనీ తెలిపారు.
Admin
ANDHRA TIMES NEWS